మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు - కొత్తగా మరో 30 వేలు

గురువారం, 16 సెప్టెంబరు 2021 (10:34 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా మరో 30570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కి చేరింది. అలాగే, నిన్న 38,303 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 431 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,43,928కి పెరిగింది.  
 
ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,25,60,474 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,42,923 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 64,51,423 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. 
 
దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 76,57,17,137 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశంలోనే అత్య‌ధికంగా కేరళలో 17,681 కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న ఆ రాష్ట్రంలో 208 మంది కరోనా రోగులు మృతి చెందారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు