క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం... కివీస్ బౌలర్ సరికొత్త రికార్డు!!

వరుణ్

మంగళవారం, 18 జూన్ 2024 (11:58 IST)
క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం చోటుచేసుకుంది. న్యూజిలాండ్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కేవలం నాలుగు ఓవర్లు వేసిన ఫెర్గూసన్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు కదా ఏకంగా మూడు వికెట్లు నెలకూల్చాడు. అంటే నాలుగు ఓవర్లు, నాలుగు మెయిడిన్ ఓవర్లు.. మూడు వికెట్లు. ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు ఇవే కావడం గమనార్హం. 
 
అలాగే టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇలా 4 ఓవర్లు మెయిడిన్ వేసిన తొలి బౌలర్‌గా కూడా ఫెర్గూసన్ సన్న్ నిలిచాడు. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఈ నయా రికార్డు అందుకున్నాడు. గతంలో కెనడాకు చెందిన సాద్ బిన్ జఫర్ కూడా 4 మెయిడిన్ ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. ఇపుడు ఈ రికార్డు తుడిచిపెట్టుకునిపోయింది. 
 
మరోవైపు, పాపువా న్యూ గినియాతో జరిగిన ఈ మ్యాచులో కివీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పీఎన్‌జీని ఫెర్గూసన్ ఘోరంగా దెబ్బతీశాడు. దీంతో ఆ జట్టు 78 పరుగులకే కుప్పకూలింది. 
 
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇక ఇప్పటికే ఈ రెండు జట్లు టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో గ్రూప్-సీలో న్యూజిలాండ్ మూడో స్థానంతో తన ప్రస్థానాన్ని ముగించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు