భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్!!

వరుణ్

సోమవారం, 17 జూన్ 2024 (16:16 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎంపిక దాదాపుగా ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించాల్సివుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వరకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. 
 
ఆ వెంటనే అతని స్థానంలో గంభీర్ తన పని మొదలెట్టనున్నాడు. ఈ మేరకు గంభీర్ డిమాండ్‌కు బీసీసీఐ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. జట్టు సహాయక కోచింగ్ సిబ్బందిని తానే నిర్ణయిస్తానని, అందుకు సమ్మతిస్తేనే కోచ్‌గా వస్తానని గంభీర్ షరతు విధించినట్టు సమచారం. దీనికి బీసీసీఐ సమ్మతించడంతో బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. 
 
'భారత జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం గంభీర్‌తో చర్చించాం. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ద్రవిడ్ స్థానాన్ని అతను భర్తీ చేస్తాడు' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బ్యాటింగ్‌‍కు విక్రమ్ రాథోడ్, బౌలింగ్‌‍కు పారస్ మాంబ్రే, ఫీల్డింగ్‌కు దిలీప్ సహాయ కోచ్‌లుగా ఉన్నారు. వీళ్ల స్థానాల్లో కొత్తవాళ్లను గంభీర్ తీసుకునే అవకాశముంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు