గ్రేట్ టీమ్ వర్క్... యువ భారత్‌కు జేజేలు : సచిన్ ట్వీట్ (వీడియో)

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (14:18 IST)
భారత యువ క్రికెటర్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపారు. "గ్రేట్ టీమ్ వర్క్.. బిగ్ డ్రీమ్స్ వర్క్" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. కంగ్రాచ్యులేషన్ వరల్డ్ ఛాంపియన్స్ అంటూ పేర్కొంటూనే, రాహుల్ ద్రావిడ్‌కు, పరాస్‌కుతన అభినందనులు అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఓవెల్ వేదికగా జరిగిన అండర్ -19 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్లు ఆస్ట్రేలియాను చిత్తు చేసి నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 216 పరుగుల విజయలక్ష్యాన్ని భారత కుర్రోళ్లు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 38.2 ఓవర్లలోనే ఛేదించి విశ్వవిజేతగా అవతరించారు. 
 

WITH GREAT TEAM WORK, BIG DREAMS WORK. Congratulations to our WORLD CHAMPIONS!! We are proud of you. A big congratulations to Rahul and Paras for their guidance. #ICCU19CWC #INDvAUS pic.twitter.com/w0heorY8g6

— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు