ఏపీ సీఎం జగన్‌తో అనిల్ కుంబ్లే భేటీ!

సోమవారం, 5 జులై 2021 (16:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భారత్ దిగ్గజ స్పిన్ బౌలర్, మాజీ టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా జగన్‌తో కరచాలనం చేసిన కుంబ్లే... ఆయనకు పుష్పగుచ్ఛాన్ని, జ్ఞాపికను అందించారు. మర్యాదపూర్వకంగానే జగన్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ కుంబ్లే కలిసినట్టు వైసీపీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇండియన్‌ టెస్ట్ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే.#CMYSJagan #YSJaganCares #YSJagan pic.twitter.com/VaZh34QBpq

— YSR Congress Party (@YSRCParty) July 5, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు