క్రికెట్ మైదానంలోనే కుప్పకూలాడు.. ఆపై ఏం జరిగిందంటే? (వీడియో)

ఆదివారం, 17 డిశెంబరు 2017 (13:46 IST)
క్రికెట్ మైదానంలోనే ఓ బౌలర్ ప్రాణాలు కోల్పోయాడు. కేరళ-కర్ణాటక సరిహద్దులోని కాసరగూడ్‌లో మైదానంలోనే ఓ బౌలర్ మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో మైదానంలోనే ఓ యువ క్రికెటర్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. బౌలింగ్‌ ఎండ్‌ నుంచి బాల్ వేసేందుకు సిద్ధమైన పద్మనాభ్‌(20) ఉన్నపళంగా కిందపడ్డాడు. 
 
తీవ్ర గుండెపోటుతో కుప్పకూలడంతో అంపైర్‌ సహా తోటి క్రీడాకారులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పద్మనాభ్ మరణించాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మంజేశ‍్వర పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమైన పద్మనాథ్ గుండెపోటుతో కుప్పకూలడాన్ని ఓ న్యూస్ ఛానల్ ఫేస్‌బుక్ ఛానల్లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్‌లో వైరల్‌ అవుతోంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు