మద్యం మత్తులో భార్యపై కుకింగ్ పాన్‌‍తో దాడి.. వినోద్ కాంబ్లీపై కేసు

ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (14:18 IST)
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. మద్యం మత్తులో ఆయన భార్యపై దాడి చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. కాంబ్లీ భార్య ఆండ్రియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను దుర్భాషలాడటంతోపాటు దాడికి పాల్పడినట్లు కాంబ్లీపై ఆండ్రియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పోలీసులు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఆండ్రియా తలకు గాయం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో తనపై దాడి చేశాడని కాంబ్లీ భార్య ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే, వినోద్ కాంబ్లీని అదుపులోకి తీసుకోలేదు. ఫిర్యాదులో పేర్కొన్నదానిని బట్టి.. కుకింగ్‌ పాన్‌ను విసిరి కొట్టడంతో కాంబ్లీ భార్య తలకు దెబ్బ తగలిగిందని అధికారులు వెల్లడించారు.
 
శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మద్యం తాగి వచ్చిన కాంబ్లీ విపరీతంగా దుర్భాషలాడుతూ ఆమెపై దాడి చేసినట్లు తెలిపారు. కాంబ్లీ భార్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 324, ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు