బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌కు మరోమారు బెదిరింపు మెయిల్

ఆదివారం, 28 నవంబరు 2021 (13:02 IST)
భారత మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీకి చెందిన ఢిల్లీ లోక్‌సభ సభ్యుడు గౌతం గంభీర్‌కు మరోమారు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇటీవల ఆయనకు పాకిస్థాన్ నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇపుడు ఇదే మెయిల్ అడ్రస్ నుంచి మరోమారు బెదిరింపు మెయిల్ రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ మెయిల్‌ను పంపించింది పాకిస్థాన్ దేశంలోని ఓ కాలేజీ విద్యార్థిగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పైగా, వ్యక్తి వయసు 25 నుంచి 26 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. కరాచీలోని సింధ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మరోమారు ఇదే తరహా మెయిల్ రావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు