ఓటీటీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. డిజిటల్ చరిత్రలో అదుర్స్

మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (14:19 IST)
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అభిమానులను అలరించింది. వన్డేల్లో పరుగుల పరంగా పాక్‌పై అతి పెద్ద విజయంతో రికార్డు సృష్టించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగినప్పటికీ ఈ మ్యాచ్ కోసం అభిమానులు టీవీల ముందు వాలిపోయారు. దాంతో, వ్యూయర్‌‌షిప్‌లో రికార్డులు బద్దలయ్యాయి. 
 
ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అయింది. ఈ మ్యాచ్‌ను ఏకకాలంలో రెండు కోట్ల 80 లక్షల మంది వీక్షించారు. డిజిటల్ చరిత్రలో భారత్‌ ఏ మ్యాచ్‌కైనా ఇదే అత్యధిక వ్యూయర్‌‌షిప్‌. 
 
గతంలో 2019 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌‌ను 2.52 కోట్ల మంది వీక్షించారు. నాలుగేళ్లుగా చెక్కుచెదరని ఈ రికార్డును ఆసియా కప్‌‌లో భారత్-పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ బద్దలు కొట్టింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు