మ్యాచ్ ఫిక్సింగ్ : నలుగురు సౌతాఫ్రికా క్రికెటర్లపై నిషేధం

సోమవారం, 8 ఆగస్టు 2016 (15:31 IST)
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో దక్షిణాఫ్రికా క్రికెటర్లు చిక్కుకున్నారు. ఫలితంగా నలుగురు క్రికెటర్లపై నిషేధం విధించారు. వీరిలో మాజీ వికెట్ కీపర్ థామీ కూడా ఉన్నాడు. ఈ క్రికెటర్లను ఏడు నుంచి 12 ఏళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ వెల్లడించింది.
 
మాజీ వికెట్ కీపర్ థామీ‌పై 12 ఏళ్ల నిషేధం విధించారు. 2015లో దేశీయంగా జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. నిషేధానికి గురైన మిగతా ముగ్గురు ఆటగాళ్లలో పుమెలెలా మట్షిక్వే, ఎతీ ఎంబలాతి, జీన్ సైమ్స్ ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి