టెస్టు క్రికెట్కు ధోనీ ఉన్నట్టుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్టు బాధ్యతలు చేపట్టిన కోహ్లీ సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం శ్రీలంక టెస్టు సిరీస్ను గెలుచుకోవాలనే ఆకలిమీదున్న కోహ్లీ తప్పకుండా అనుకున్నది సాధిస్తాడని కొనియాడాడు. గాలె టెస్టులో కెప్టెన్ హోదాలోనే సెంచరీ సాధించి జట్టును భారీ స్కోరు దిశగా కోహ్లీ నడిపించాడని గంగూలీ ప్రశంసించాడు.