మొదట బౌలింగ్లో కివీస్ను కట్టడి చేసిన భారత అమ్మాయిలు ఆ తర్వాత బ్యాట్తో సత్తా చాటారు. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, కెప్టెన్ మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (71), హర్మన్ ప్రీత్ కౌర్ (63), కెప్టెన్ మిథాలీ రాజ్ (57*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ (21), షఫాలీ వర్మ (9), రిచ్ ఘోష్ (7*) పరుగులు చేశారు.
కివీస్ బౌలర్లలో జేన్సన్, అమేలీ కేర్, జోన్స్, హన్నా రోవ్ తలో వికెట్ తీశారు. వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని పట్టుదలగా ఆడిన భారత అమ్మాయిలు ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా కివీస్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేశారు.