కాన్పూర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 500 టెస్ట్ మ్యాచ్లో భారత్ తన రెండో ఇన్నింగ్స్ను 377/5 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ అధిక్యం 56 పరుగులు కలుపుకుని 433 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచింది. 159/1 ఓవర్ నైట్ స్కోర్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ సేన నిలకడగా ఆడింది.
ఆదివారం ఆటలో మురళీ విజయ్(76) వికెట్ కోల్పోయిన భారత్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ (18) వికెట్ను నష్టపోయింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో చటేశ్వర పుజారా (78) అవుట్ కావడంతో భారత్ కొంచెం తడబడినట్లు కనిపించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 318 ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 262 పరుగులకే కుప్పకూలింది.
కాగా, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లోనూ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 9 పరుగులకే అవుట్ అయిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్లో 18 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 40 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన కోహ్లీ, క్రెయిగ్ బౌలింగ్లో సోధీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారి పట్టాడు.