ఐపీఎల్ 14 : కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

శుక్రవారం, 8 అక్టోబరు 2021 (09:13 IST)
ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలు దుబాయ్ వేదికగా పోటాపోటీగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌‍కతా నైట్ రైడర్స్ జట్టు విజయభేరీ మోగించింది. తన ప్లే ఆఫ్స్‌‌‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో కోల్‌‌‌‌కతా నైట్‌ ‌‌‌రైడర్స్‌‌‌‌ జూలు విదిల్చింది. ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొడుతూ 86 రన్స్‌‌‌‌ భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌‌‌‌ను చిత్తు చేసింది.
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కోల్‌‌‌‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) రాణించారు. తర్వాత రాజస్థాన్‌‌‌‌ 16.1 ఓవర్లలో 85 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. తెవాటియా (36 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. శివమ్​ మావికి ‘మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 
 
ఈ గెలుపుతో పాటు మెరుగైన రన్​రేట్​తో  కోల్‌‌‌‌కతా (14 పాయింట్లు) ప్లే ఆఫ్స్​ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌‌‌‌లో ముంబై 171 రన్స్‌‌‌‌ తేడాతో హైదరాబాద్‌‌‌‌పై గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌‌‌‌కు వెళుతుంది. లేదంటే కేకేఆర్​ ముందుకెళ్తుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు