ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్మోడీ కష్టాల్లో కూరుకుపోయారు. 2008 ఐపీఎల్ సీజన్ టీవీ ప్రసార హక్కులకు సంబంధించి వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్, మల్టీ స్క్రీన్ మీడియా(ఎమ్ఎస్ఎమ్)ల మధ్య జరిగిన లావాదేవీల్లో రూ. 425 కోట్ల మేరకు అవకతవకల్లో లలిత్ మోడీ ప్రమేయం ఉన్నట్లు బీసీసీఐ ఫిర్యాదు చేసింది. అనంతరం ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. గతేడాది ఆగస్టులో లలిత్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎల్ఆర్లు సైతం ఇప్పటికే మూడు జారీ అయిన సంగతి తెలిసిందే.