పవన్ కళ్యాణ్ టీం ఇండియా ఆటతీరు అసాధారణమైనదని అభివర్ణించారు. ఫైనల్లో అన్నీ కేటగిరీల్లో టీమిండియా ఆటగాళ్లు మెరుగ్గా రాణించారని కొనియాడారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ను కైవసం చేసుకోవడం జట్టు అంకితభావం, ప్రతిభకు నిదర్శనమని ఆయన హైలైట్ చేశారు. భవిష్యత్ టోర్నమెంట్లలో జట్టు విజయం కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.
అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు విజయం పట్ల వివిధ వర్గాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దుబాయ్లో న్యూజిలాండ్తో జరిగిన చివరి మ్యాచ్లో రోహిత్ శర్మ బృందం నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, టీమిండియాకు అభినందనలు తెలిపారు. 'మెన్ ఇన్ బ్లూ' విజయంతో అభిమానులు ఆనందించడంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు సంబరాలతో నిండిపోయాయి.