పూణే టెస్ట్ మ్యాచ్ : అత్యంత చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

సెల్వి

శుక్రవారం, 25 అక్టోబరు 2024 (12:56 IST)
పూణే వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును సమం చేశాడు. దీంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (34) సరసన చేరాడు. 
 
ప్రపంచ క్రికెట్‌లో అత్యధికసార్లు సున్నా పరుగులకే (డకౌట్) అయిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుమీద ఉండేది. ఇపుడు ఈ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. గురువారం నుంచి న్యూజిలాండ్ పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో ఆయన ఈ చెత్త రికార్డు నెలకొల్పారు.
 
ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డకౌట్ల (34) రికార్డును రోహిత్ సమం చేశాడు. ఇక ఈ జాబితాలో జహీర్ ఖాన్ (43), ఇషాంత్ శర్మ (40), విరాట్ కోహ్లి (38), హర్భజన్ సింగ్ (37), అనిల్ కుంబ్లే (35) ఉన్నారు.
 
కాగా, పూణే టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగి మొత్తం 9 బంతులను ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయకుండానే వెవిలియన్‌కు చేరాడు. టీమ్ సౌథి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలా టెస్టుల్లో డకౌట్ కావడం రోహిత్ శర్మకు ఇది ఆరోసారి.
 
పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్‌ను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. కేవలం 259 పరుగులకే ఆలౌట్ చేసిన విషయం తెల్సిందే. కివీస్ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లతో విజృంభించగా.. అశ్విన్ 3 వికెట్లతో రాణించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు