వరల్డ్ క్రికెట్ కప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించలేం : ఐసీసీ

ఆదివారం, 3 మార్చి 2019 (16:05 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు షాక్ తగిలింది. త్వరలో జరుగనున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్‌ను దూరంగా పెట్టలేమని ఐసీసీ తేల్చచెప్పలేదు. పుల్వామా దాడి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో సంబంధాలు తెంచుకోవాలంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసిన విషయం తెలిసిందే.
 
దీనిపై ఐసీసీ స్పందిస్తూ, ఇలాంటి విషయాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. అయితే ఇలాంటిది చేసే అవకాశం అస్సలు లేదు. దేశాలపై నిషేధం అన్నది ప్రభుత్వాల స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప ఇందులో ఐసీసీకి ఎలాంటి సంబంధం లేదని ఐసీసీ చైర్మన్ స్పష్టం చేశారు. 
 
దీనిపై ఐసీసీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినా.. సభ్యులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. బోర్డు తరపున ఈ సమావేశానికి సెక్రటరీ అమితాబ్ చౌదరి హాజరయ్యారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఎంతో మంది విదేశీ ప్లేయర్స్ ఆడుతున్నా.. ఎవరూ ఇలాంటి ఫిర్యాదు చేయలేదు. 
 
భద్రత కీలకమైనదే అయినా దీనిపై పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉన్నాం అని ఐసీసీ అధికారి చెప్పారు. ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్ 16న పాకిస్థాన్‌తో ఇండియా ఆడనుంది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆడాలా వద్దా అన్నదానిపై భారత్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు