అన్యాయంగా ఓ ఇంట్లో నిప్పులు పోసింది... సనా జావెద్‌పై నెటిజన్ల ఫైర్లు

వరుణ్

సోమవారం, 29 జనవరి 2024 (14:07 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ మూడో భార్య సనా జావెద్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అన్యాయనంగా ఓ ఇంట్లో నిప్పులు పోసిందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఇకపై సనా జావెద్ చూసే షోలను చూడబోమని తెగేసి చెబుతున్నారు. షోయబ్ అక్తర్‌తో వివాహం తర్వాత ఆమె తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేసింది. ఓ దుస్తుల బ్రాండ్‌కు చెందిన ఈ ఫోటోపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 
 
ద్వంద్వ ముఖాల మనుషులని ఒకరు, ఇకపై నీ షోలు చూడబోమని మరొకరు కామెంట్స్ చేస్తే, అన్యాయంగా ఓ ఇంట్లో నిప్పులు పోశావవని ఇంకొకరు దుమ్మెత్తి పోశారు. ఒక మహిళ మరో మహిళ కుటుంబాన్ని విడదీసిందని మరొకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ వివాహం సరికాదని ఇంకో యూజర్ కామెంట్ చేస్తే, మీకోసం వేలాది తిట్లు రెఢీగా ఉన్నాయని మరికొందరు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా లైకులు సంపాదించుకున్న ఈ పోస్టుకు ట్రోల్స్‌ కూడా విపరీతంగా వెంటాడుతున్నాయి. 
 
కాగా, భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో షోయబ్ మాలిక్ నుంచి సానియా మీర్జా విడాకులు తీసుకున్నారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు