భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మొత్తం 57 దరఖాస్తులు అందగా, వాటిలో నుంచి 21 దరఖాస్తులతో ఓ జాబితాను రూపొందించిన బీసీసీఐ... అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ల నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని కోరింది.
అదేసమయంలో సచిన్, లక్ష్మణ్ల నుంచి కఠినమైన ప్రశ్నలు ఎదురయ్యాయని, వీటికి తనకు తెలిసిన మేరకు సమాధానమిచ్చినట్టు రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తనకు తెలిసిందేమిటంటే.. సచిన్ పొట్టివాడైన మహా ముదురు అని గ్రహించినట్టు చెప్పుకొచ్చాడు.