ఐపీఎల్ సీజన్లో భాగంగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఇపుడు మిగిలిన ఐదు మ్యాచ్లలో ఆ జట్టు విజయం సాధించాల్సివుంది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యుల్లో నూతనోత్తేజం పొందేందుకు వీలుగా ఆ జట్టు యజమానురాలు కావ్య మారన్.. జట్టు సభ్యులను మాల్దీవులకు విహార యాత్రకు పంపించారు. సన్ రైజర్స్ జట్టు ప్లేఆఫ్స్కు చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన సంక్లిష్ట పరిస్థితి నెలకొంది.
దీంతో కాస్త సేద తీరేందుకు మాల్దీవులకు పయనమైంది. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ మేరకు 35 సెకన్ల వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆటగాళ్లు మాల్దీవుల్లో తమ విరామాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. తదుపరి మ్యాచ్కు మరికొన్ని రోజుల సమయం ఉండటంతో తమ ఆటగాళ్లు రీచార్జ్ అయ్యేందుకు ఈ వెకేషన్ ఉపకరిస్తుందని సన్ రైజర్స్ టీమ్ యాజమాన్యం భావిస్తుంది.
కాగా, సన్ రైజర్స్ జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే పాట్ కమిన్సన్ సారథ్యంలోని జట్టు తమ తదుపరి ఐదు మ్యాచ్లలోనూ తప్పక గెలవాల్సిన క్లిష్ట పరిస్థితి నెలకొంది. ఏ ఒక మ్యాచ్లో ఓడినా ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి. సన్ రైజర్స్ తమ తదుపరి మ్యాచ్ను మే 2వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ఆడనుంది.