అత్యధిక సెంచరీల రికార్డు (49 సెంచరీలు)ను కోహ్లీ అధిగమిస్తాడన్నట్టుగానే గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే, వన్డేల్లో కోహ్లీ 22 సెంచరీలు కొట్టిన సంగతిని గుర్తు చేసిన ఆయన, ఎంతలేదన్నా మరో 10 సంవత్సరాల పాటు కోహ్లీ ఆడతాడు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామని అన్నాడు.
ప్రతి ఒక్కరి రికార్డు కూడా బ్రేక్ అవుతుందని, అయితే సచిన్ నెలకొల్పిన వంద సెంచరీల రికార్డు మాత్రం సురక్షితమని, అది చిరకాలం నిలిచివుంటుందని వివరించాడు. దక్షిణాఫ్రికాను భారత్ 130 పరుగుల తేడాతో ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదని, ఈ మ్యాచ్ తరువాత భారత్ ఫామ్ ఇతర జట్లకు తెలిసిందన్నాడు.