అద్భుతమైన ఫామ్లో దూసుకెళ్తున్న టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీపై విండీస్ మాజీ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ అభిమానుల జాబితాలో చేరిన రిచర్డ్స్.. కోహ్లీ ఆటను ఆస్వాదించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నాడు. విరాట్ ఇన్నింగ్స్ చూడని వారు చాలా కోల్పోతారని, తాను తొలిసారి కోహ్లీ ఆటను చూశాక అలా అనిపించిందని రిచర్డ్స్ తెలిపాడు.
ఈ సందర్భంగా కోహ్లీకి ఆల్ ది బెస్ట్ చెప్పానని, తొలి మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ ఇన్నింగ్స్ సూపరంటూ కితాబిచ్చారు. కేవలం ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు ఇంత పని చేస్తాడని ఊహించలేదని రిచర్డ్స్ వ్యాఖ్యానించాడు. ఆసీస్తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్ల్లోనూ కోహ్లీ సెంచరీలు సాధించడం చూసి షాక్ అయ్యానన్నాడు.