డబ్ల్యూటీసీ ఫైనల్‌.. సునీల్ గవాస్కర్ కొన్ని సూచనలు

మంగళవారం, 22 జూన్ 2021 (11:08 IST)
డబ్ల్యూటీసీ ఫైనల్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్‌ కొన్ని సూచనలను చేశారు. సౌథాంప్టన్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే.. విజేతను ప్రకటించడానికి ఐసీసీ ఒక సూత్రాన్ని కనుగొనాలని సునీల్ అన్నారు. ఇరు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగుతున్న మ్యాచ్‌లో వరుణుడు పదేపదే అంతరాయం కలిగిస్తున్నాడు. 
 
దాంతో ఇప్పటికే నాలుగు రోజుల ఆటలో రెండు రోజులకుపైగా నిలిచిపోయిందన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు ఒక రిజర్వ్‌డే కేటాయించినా ఫలితం తేలేలా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసేలా కనిపిస్తోందన్నాడు. దాంతో ఇరు జట్లూ ట్రోఫీని పంచుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. 
 
"ఐసీసీ ఫైనల్స్‌లో ఒక ట్రోఫీని ఇలా రెండు జట్లు పంచుకోవడం ఇదే తొలిసారి కానుంది. ఫుట్‌బాల్‌ ఆటలో విజేతను ప్రకటించాలంటే వాళ్లకు పెనాల్టీ షూట్‌ఔట్ లేదా మరో పద్ధతిని అవలంబిస్తారు. అలాగే టెన్నిస్‌లో ఐదు సెట్లు నిర్వహిస్తారు. 
 
దాంతో పాటు టై బ్రేకర్‌ కూడా ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ డ్రాగా పూర్తయితే విజేతను ప్రకటించడానికి ఒక సూత్రాన్ని కనుగొనాలి. ఈ విషయంపై ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి." అంటూ సునీల్ గవాస్కర్ వెల్లడించాడు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు