వన్డే ప్రపంచ కప్ : శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్

మంగళవారం, 17 అక్టోబరు 2023 (09:47 IST)
ప్రపంచ కప్‌లో భాగంగా సోమవారం జరిగిన 14వ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- శ్రీలంక జట్లు పోటీపడ్డాయి. ఇందులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీని ప్రకారం శ్రీలంక జట్టు బౌలింగ్‌కు దిగారు. శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 
 
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్.. ఈ గెలుపు క్రెడిట్ బౌలర్లదేనని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 
 
శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక (67 బంతుల్లో 8 ఫోర్లతో 61), కుశాల్ పెరీరా(82 బంతుల్లో 12 ఫోర్లతో 78) హాఫ్ సెంచరీల రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా(4/47) నాలుగు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు.
 
శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక మూడు వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలాగే ఓ వికెట్ పడగొట్టాడు. నాలుగు వికెట్లతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆడమ్ జంపాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు