నేడు అమీతుమీకి సిద్ధమైన సౌతాఫ్రికా - పాకిస్థాన్ :: ఓడితే దాయాది దేశం ఇంటికే

శుక్రవారం, 27 అక్టోబరు 2023 (11:31 IST)
భారత్ వేదికగా ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికీ సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో అగ్రశ్రేణి జట్లు తమ చెత్త ప్రదర్శనతో ఇంటిదారి పట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా - పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడితే మాత్రం సెమీస్ ఆశలు గల్లంతుకానున్నాయి. ఆ తర్వాత నామమాత్రపు మ్యాచ్‌లలో ఆడి ఇంటిదారిపట్టాల్సి వస్తుంది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ స్పందిస్తూ, సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలిచి తీరాలన్న ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే, ఇలాంటి పరిస్థితి తమకు కొత్తేంకాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ పరిస్థితిని ఎదుర్కొని అద్భుత ప్రదర్శన చేశామని గుర్తుచేశారు. 
 
ఇక సౌతాఫ్రికా మ్యాచ్ విషయంలో తాము కొత్తగా కోల్పోయేదేమీ ఉండదనే ఆలోచనతోనే బరిలోకి దిగుతామన్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుందనేది జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ తెలుసన్నారు. అందువల్ల ఈ మ్యాచ్‌లో గెలవడం తప్ప తమ ముందు మరో మార్గం లేదని చెప్పారు. అందువల్ల శుక్రవారం మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని షాదాబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు