నేపియర్లో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు కష్టాల నుంచి బయటపడుతుందని జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. ఆట చివరిరోజైన సోమవారం భారత ఆటగాళ్లు మరింతగా రాణించి, తాము కష్టాల నుంచి బయటపడతామని చెప్పారు.
ఈ టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ ఓటమి కోరల నుంచి బయటపడిన విషయం తెల్సిందే. అయితే, ఆట నాలుగో రోజున ఓపెనర్ గంభీర్ (102), సచిన్ టెండూల్కర్ (58), రాహుల్ ద్రావిడ్ (62)లు రాణించడంతో ఓటమి గండం నుంచి బయటపడింది.