రంజీ ట్రోఫీ సెమీఫైనల్ : ముంబయితో ఢిల్లీ ఢీ..!

FILE
ఆదివారంనుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబయి జట్టు డిల్లీ జట్టుతో, ఉత్తరప్రదేశ్ జట్టుతో కర్ణాటక జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడనున్నాయి. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థులు ముంబయి-ఢిల్లీ జట్ల మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే సమరం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ముంబయి జట్టులో స్టార్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్‌లు లేకపోయినా.. అలాగే ఢిల్లీ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోయినా.. పోరాటానికి మారుపేరైన ఈ రెండు జట్లమధ్య సమరం క్రికెట్ ప్రేమికుల్లో వేడిని పుట్టిస్తోంది.

ఈ సందర్భంగా ముంబయి కెప్టెన్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. శుభారంభం చేయటంలో తమ ఓపెనర్లు విఫలమవుతున్నారనీ, అయితే కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటే భారీ స్కోరు చేయటం కష్టమేమీ కాదని అన్నాడు. అదే విధంగా ఢిల్లీ కోచ్ విజయ్ దహియా మాట్లాడుతూ.. సీనియర్లు లేకపోయినా తమ జట్టు అద్భుతంగా ఆడి సెమీస్‌కు చేరిందనీ, సెమీస్‌లో కూడా అదే జోరు కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి