పర్యాటక ఆస్ట్రేలియా స్పిన్నర్ క్రేజా భారత్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. తొలి టెస్ట్ అరంగేట్రంలోనే సత్తా చాటాడు. స్నిన్ను ఎదుర్కోవడంతో మంచి పేరున్న భారత బ్యాట్స్మెన్స్ను తొలి టెస్ట్ ఆడుతున్న క్రేజా ముప్పతిప్పలు పెట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో ఎనిమిది వికెట్లు తీశాడు. దీంతో క్రేజా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం ఘనంగా చేశాడు. తొలి టెస్ట్ మ్యాచ్లోనే ఎనిమిది వికెట్లు తీసిన మూడో బౌలర్గా సరికొత్త రికార్డు సృష్టించాడు.
అయితే.. భారత్ తొలి ఇన్నింగ్స్లో సాధించిన 411 పరుగుల్లో సగం పరుగులు క్రేజా బౌలింగ్లోనే పిండుకోవడం గమనార్హం. అంతకుముందు 311 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్.. 441 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఇన్నింగ్స్లో గంగూలీ, ధోనీలు అర్థ సెంచరీలతో రాణించారు.
ఆ తర్వాత వచ్చిన టెయిల్ ఎండ్ బ్యాట్స్మెన్స్ సున్నా పరుగులకే వికెట్లు పారేసుకోవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత ఇన్నింగ్స్లో సెహ్వాగ్ (66), విజయ్ (33), టెండూల్కర్ (109), లక్ష్మణ్ (64), గంగూలీ (85), ధోనీ (56) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో క్రేజా 215 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీయగా, వాట్సన్, జాన్స్న్లు ఒక్కో వికెట్ తీశాడు.