బూతుల ఎన్సైక్లోపీడియా పోసాని కృష్ణమురళి పాపం పండిందా?
తెలుగు సినీ నటుడు, దర్శకుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఆయనను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్లను వ్యక్తిగతంగాను, వారి కుటుంబ సభ్యులను అసభ్యపదజాలం, బూతులతో దూషించిన కేసులో ఆయనను అరెస్టు చేశారు. దీంతో పోసాని పాపం పండిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.