తల్లిదండ్రుల ఎదుటే మైనర్ బాలికకు ముద్దు, చితక్కొట్టారు

బుధవారం, 19 జనవరి 2022 (12:26 IST)
స్మార్ట్ ఫోన్లు కారణంగా చదువుకోవాల్సిన కొందరు పిల్లలు పక్కదారి పడుతున్నారు. పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు ఓ యువకుడు. ఆమెను పెళ్లాడుతానంటూ గోల చేస్తుండటంతో విషయం కాస్తా పెద్దల దృష్టికి వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగింది?

 
తమిళనాడులోని ఉత్తుకోట్టై గ్రామానికి చెందిన సతీష్‌కుమార్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో 10వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికను ప్రేమించాననీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాంటూ వెంటబడ్డాడు. ఇంట్లో తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించాలని ఆమెని కోరాడు.
 
 
బాలిక తల్లిదండ్రులు ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో, సతీష్‌కుమార్ సోమవారం ఉదయం బాలిక ఇంట్లోకి చొరబడి బాలికను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన బాలిక కుటుంబ సభ్యులు సతీష్‌కుమార్‌ ఇంటికి చేరుకుని చితకబాదారు.

 
ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వెల్లవేడు పోలీసులు సతీష్‌కుమార్‌ పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సతీష్‌కుమార్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు