డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఠాగూర్

బుధవారం, 30 జులై 2025 (09:18 IST)
డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను ఓ యువతి ప్రియురాలు కిడ్నాప్ చేశారు. దుబాయ్ ట్రావెల్ సంస్థకు మేనేజరుగా పని చేస్తున్న లారెన్స్ మెల్విన్ ఇటీవల తన స్వస్థలమైన బెంగుళూరుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో జూలై 16వ తేదీ నుంచి లారెన్స్ కనిపించట్లేదని తల్లి బెంగుళూరులోని అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు ఫోను చేసిన దండగులు రూ.2.5 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్టు పేరొన్నారు. 
 
కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లారెన్స్ అపహరణకు స్వయానా అతడి గర్ల్ ఫ్రెండ్ మహిమా పథక రచన చేసినట్లు గుర్తించారు. జులై 14న బయటకు వెళ్లామని మహిమా చెప్పడంతో లారెన్స్ ఓ కారు బుక్ చేసుకొని ఆమెతోపాటు వెళ్లారు. కొంతదూరం వెళ్లాక డ్రైవరు కారును దారి మళ్లించాడు. ఓచోట మరో ఇద్దరు వ్యక్తులు కారెక్కి లారెన్స్‌పై దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ.లక్ష లాక్కొని ఓ అపార్టుమెంటులో బంధించారు. 
 
దాదాపు ఎనిమిది రోజులు చిత్రహింసలకు గురిచేసి.. లారెన్స్ కుటుంబానికి ఫోను చేసి రూ.2.5 కోట్లు డిమాండ్ చేశారు. అదే అపార్టుమెంట్‌లో ఉంటున్న ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు లారెన్సు‌ను రక్షించి, నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన కుట్రదారు మహిమా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు