ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపారు.. హోటల్‌కు తీసుకెళ్లిన అత్యాచారం చేశారు...

ఠాగూర్

శనివారం, 22 ఫిబ్రవరి 2025 (08:41 IST)
కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో ఓ దారుణం జరిగింది. కోరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్‌‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా ఉన్న మహిళతో నలుగురు యువకులు మాటలు కలిపారు. ఆ తర్వాత ఆ మహిళను హోటల్‌ గదిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
33 యేళ్ళ ఓ మహిళ జ్యోతి నివాస్ కాలేజీ జక్షంన్ వద్ద వేచివుంది. ఆ సమయంలో 20 యేళ్ల వయస్సున్న నలుగురు యువుకులు ఆ మహిళ వద్దకు వచ్చి మాటలు కలిపారు. ఆ తర్వాత స్నేహంగా మెలిగి డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఆ తర్వాత ఆమెను గదిలోకి తీసుకుని అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ప్రైవేట్ హోటల్‌ టెర్రాస్‌పైకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. 
 
ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం 6 గంటలకు విడిచిపెట్టారని పేర్కొన్నారు. ఉదయం ఇంటికి చేరుకున్నాక జరిగిన దారుణం గురించి భర్తకు వివరించగా, పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ సారా ఫాతిమా స్పందిస్తూ, శుక్రవారం ఉదయం 7.30 - 8 గంటల సమయంలో ఈ ఘటనపై తమకు సమాచారం అందిందన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగాన్ని ఉన్నట్టు తెలిపారు. అయితే, ఆ యువకులతో ఆమె ఎందుకు వెళ్లారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 
 
ఢిల్లీకి చెందిన ఈ మహిళ తన భర్తతో బెంగుళూరులో స్థిరపడ్డారని, ఆమె క్యాటరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తుందని పోలీసులు వివరించారు. నిందితులు తన స్నేహితుడుని కలిసేందుకు అక్కడకి వెళ్లినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు