తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్, డ్రాయర్లతో అపార్టుమెంటులోకి దూరి..?

సోమవారం, 4 అక్టోబరు 2021 (14:55 IST)
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఇంటికి తాళం వేసి వెళితే తిరిగొచ్చేసరికి ఇంట్లోని విలువైన వస్తువులు ఉంటాయో లేదోనన్నది అనుమానమే. అంతేకాదు ఇంట్లో ఉన్నా కూడా దొంగలు చాకచక్యంగా దూరి దొంగతనానికి పాల్పడుతున్నారు
 
అలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. ఈరోజు తెల్లవారుజామున విద్యానగర్ లోని ఒక అపార్టుమెంటులో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సిసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. నిన్న రాత్రి తమ అపార్టుమెంట్లో దొంగతనం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు పోలీసులు.
 
అయితే తలుపులు వేసినా ఓ బ్యాంకు ఉద్యోగి ఇంట్లోకి దూరిన దొంగలు 30 గ్రాముల బంగారం, 25 వేల రూపాయల వెండి, 5 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్ళారు. అక్కడున్న సి.సి.టివి ఫుటేజ్ లను పరిశీలించారు. నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అపార్టుమెంట్, ఇంటికి తాళాలు వేసినా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
 
రాత్రి సమయాల్లో పోలీసు నిఘా మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కనబడుతోంది. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నారన్న విషయం ఇప్పుడు నగర ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. చెడ్డీ గ్యాంగ్‌ను పట్టుకునే పనిలో పడ్డారు  పోలీసులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు