ఆమె కేకలు వేసి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేసే లోపుగానే దుండగులు నరికిన తలను తీసుకుని వెళ్లిపోయారు. సుమారు 8 కిలోమీటర్ల దూరంలో వున్న ఓ గుడి ద్వారం ముందు విసిరేసి వెళ్లిపోయారు. ఈ దారుణానికి పాల్పడిందెవరన్నది తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి తల కోసం గాలించగా కాశిమజోర్పురం లోని దేవాలయం ముందు వున్నట్లు కనుగొన్నారు.