కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

ఠాగూర్

గురువారం, 17 ఏప్రియల్ 2025 (15:44 IST)
హైదరాబాద్ నగరంలోని ఫతేనగర్ ఏరియాలోని హోమ్ వ్యాలీలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి క్రూర మృగంలా ప్రవర్తించాడు. మూగ జీవాల పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించి, ఆ కుక్క పిల్లలను పట్టుకుని నేలకేసి కొట్టి రాక్షసానందం పొందాడు. అతని క్రూర చర్యలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో ఆ కిరాతకుడుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఫతేనగర్‌లోని హోమ్ వ్యాలీ అపార్టుమెంట్‌ సెల్లార్‌లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని దాని ఐదు పిల్లలను ఆ కిరాతకుడు చంపేశాడు. ఆ అపార్టుమెంట్‌లో ఉంటున్న వ్యాపారి అశిష్ ఈ దారుణానికి పాల్పడినట్టు సీసీటీవీ దృశ్యాల ద్వారా తేలింది. దీంతో అతనిపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడం ఏమిటని ఇలాంటి వారిని కఠింగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 

 

Sensitive Content

హైదరాబాద్ - ఫతేనగర్ హోమ్ వ్యాలీలో అప్పుడే పుట్టిన 5 కుక్క పిల్లలు చంపిన దుర్మార్గుడు

అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని దాని 5 పిల్లలను చంపిన మూర్కుడు pic.twitter.com/psfJsURZYE

— Telugu Scribe (@TeluguScribe) April 17, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు