ఆర్థోస్కోపీ కోసం ఆస్పత్రికి వెళ్లిన కజకిస్థాన్ మహిళ.. మత్తులో ఉండగా అత్యాచారం...

వరుణ్

బుధవారం, 17 జులై 2024 (08:27 IST)
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. కజకిస్థాన్ మహిళపై కొందరు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఆర్థోస్కాపి చేసుకునేందుకు ఆస్పత్రికి ఆ మహిళకు వైద్యులు మత్తు ఇచ్చారు. దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన కామాంధులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ నెల 9వ తేదీన ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 9వ తేదీన కజకిస్థాన్‌కు చెందిన 51 యేళ్ల మహిళ హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ఉన్న ఆర్టిమిస్ ఆస్పత్రి అనే ప్రైవేటు ఆస్పత్రిలో ఆర్థోస్కోపీ చేసుకునేందుకు చేరారు. ఆమెకు 13వ తేదీన ఈ చికిత్స చేశారు. ఇందుకోసం ఆమెకు మత్తుమందు ఇచ్చారు. దీంతో ఆమె మత్తులోకి జారుకున్నారు. అదే అదునుగా భావించిన అటెండెంట్‌గా పని చేసే ఠాకూర్ సింగ్ (25) లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన బాధితురాలి కుమార్తె ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేసింది. 
 
అదేసమయంలో ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆస్పత్రి వర్గాలు స్పందిస్తూ, నిందితుడిని తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించినట్టు వెల్లడిస్తూ, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు