ఆమె తల వేరు చేసి పెద్దమ్మ గుడి ముందు పెట్టివచ్చా, పోలీసుల ముందు కత్తితో నిందితుడు (video)

ఐవీఆర్

మంగళవారం, 27 మే 2025 (16:17 IST)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యంత భీతావహ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ రాక్షస యువకుడు ఓ మహిళ తల నరికేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషను వద్దకు వచ్చి లొంగిపోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండల కేంద్రంలో ఓ మహిళ పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు కానీ యముడులా ఆమెపై కత్తితో దాడి చేసాడు. తల నరికేశాడు.
 
అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే మహిళ తలను వేరు చేసి చంపేసాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషను వెళ్లాడు. పెద్దమ్మ గుడి ఎదురుగా ఓ మహిళను చంపేసాను. ఆమె తలను వేరు చేసా, ఆమె చచ్చిపోయింది అంటూ తన చేతిలోని కత్తిని పోలీసుల ముందు పెట్టేసాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
 
ఈ నిందితుడు గతంలో కూడా వినాయక చవితి రోజున ఓ వ్యక్తిని హత్య చేసినట్లు తేలింది. మరి హత్య చేసిన వ్యక్తి ఇలా బయట ఎలా తిరుగుతున్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా మహిళ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు.

వీడేం సైకో..

60 ఏళ్ల ముసలివిడిని నరికి.. పెద్దమ్మ గుడి వద్ద ఆమెను తల, చేతులు నరికి చంపేశా సార్ అంటూ పోలీసుల వద్దకు వెళ్లిన యువకుడు

సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. pic.twitter.com/KlfEDWKh74

— greatandhra (@greatandhranews) May 26, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు