అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తల్లిని చంపిన కుమార్తె

మంగళవారం, 3 జనవరి 2023 (11:58 IST)
తన ప్రియుడితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధానికి తల్లి అడ్డుగా ఉందని భావించిన ఓ కుమార్తె దారుణానికి పాల్పడింది. తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని కడతేర్చింది. ఇపుడు ఈ ప్రేమికులు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో జరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గ్వాలియర్‌కు చెందిన 17 మైనర్ బాలిక అదే ప్రాంతానికి 25 యేళ్ళ యువకుడిని ప్రేమించి, పెళ్లికి ముందే రిలేషన్‌ కొనసాగించడం ఆరంభించింది. ఈ విషయం కన్నతల్లికి తెలిసి, కుమార్తెను మందలించింది. ప్రియుడితో ఉన్న సంబంధాన్ని తెంచుకోవాలని, పెళ్లికి ముందే రిలేషన్‌కు స్వస్తి చెప్పాలని హితబోధ చేసింది. ఈ మాటలు ఏమాత్రం పట్టించుకోని కుమార్తె... తన ప్రియుడితో కలిసి రెండు నెలల క్రితం లేచిపోయింది. 
 
ఆ సమయంలో ఆ యువతి మైనర్ కావడంతో తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. ప్రియుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇటీవలే బెయిలుపై విడుదైన ఆ యువకుడిని బాలిక కలుసుకోవడం మొదలుపెట్టింది. అయితే, తామిద్దరం హాయిగా జీవించాలంటే అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని తన ప్రియుడితో కలిసి నిర్ణయించి, తాము అనుకున్న ప్లాన్ ప్రకారం తల్లిని చంపేసింది. చివరకు పోలీసులకు చిక్కి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు