అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్‌ పోసిన ఉన్మాది.. ఎక్కడ?

మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (09:10 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో దారుణం జరిగింది. అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికను పట్టుకుని నోట్లో యాసిడ్ పోసిన ఓ ఉన్మాది ఆ తర్వాత కత్తితో గొంతు కోశాడు. తన ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకటాచలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆ బాలికను ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం బజారుకు వెళ్లారు. 
 
బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆ బాలిక ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆ బాలికను చెరబట్టిన ఉన్మాది ఆమెను గట్టిగా పట్టుకుని నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో నొప్పి భరించలేకు బాలిక పెద్దగా కేకలు వేయడంతో గొంతుకోసి పరారయ్యాడు. 
 
ఆ బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగువారు వచ్చి జరిగిన ఘాతుకాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. వారొచ్చి రక్తపుమడుగులో ఉన్న తమ బిడ్డను నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలికను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, జిల్లా ఎస్పీ విజయరామారావులు పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉన్మాదిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు