పల్నాడు జిల్లాలో చీరతో ఉరేసుకుని ఎస్ఐ భార్య ఆత్మహత్య

ఆదివారం, 9 జులై 2023 (10:11 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లా రాజుపాలెం ఎస్ఐ భార్య మేర్లపాక నారాయణ భార్య లక్ష్మిగీత (28) బలవన్మరణానికి పాల్పడింది. తన చీరతోనే ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. స్థానికులు వెల్లడిచిన వివరాల మేరకు.. ఉదయం భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో లక్ష్మిగీత మనస్తాపం చెంది వేరే గదిలోకి వెళ్ళి ఫ్యాన్‌కు చీరలో ఉరేసుకునంది. దీన్ని గుర్తించిన ఎస్ఐ భర్త వెంటనే తలపులు పగులగొట్టి అమెను రక్షించి పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
 
ఎస్ఐ నారాయది సొంతూరు చిట్టమూరు మండలం గుణపాడు కాగా, లక్ష్మిగీతది రేణిగుంట. వీరికి మూడేళ్ల క్రితం వివాహం కాగా, మూడేళ్ల చైత్ర అనే కుమార్తె ఉంది. తమ కుమార్తె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు వారిద్దరూ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం నారాయణ ఎస్ఐ ఉన్నతాధికారుల అనుమతితో సెలవు కూడా తీసుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ, పాలుతాగే పసిపాని వదిలి లక్ష్మిగీత గదిలోకి వెళ్లి చీరకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు