చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని పెనుమూరు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. తను ప్రేమించిన యువతిని విడిచి వుండలేనంటూ ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను ఆత్మహత్య చేసుకునే ముందు తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ లేఖ రాసాడు. అందులో... సారీ డాడీ, మమ్మీ. నన్ను క్షమించండి. ఆ పిల్లను వదిలి వుండలేను. ఆమె నన్ను బాగా నమ్మించింది. నాతో వుంటానని చెప్పింది. కానీ మోసం చేసింది. ఇక నావల్ల కావడంలేదు.
ఆమె లేకుండా నేను వుండలేను. అందుకే మిమ్మల్ని విడిచి వెళ్లిపోతున్నా అంటూ లేఖలో పేర్కొన్నాడు. అరవింద్ అనే 17 ఏళ్ల యువకుడు తన కంటే 2 ఏళ్లు పెద్దదైన ఓ యువతిని ప్రేమించాడు. పెద్దలు కాదనడంతో ఇద్దరూ పారిపోయి వివాహం చేసుకున్నారు. ఐతే అరవింద్ మైనర్ కావడంతో పెళ్లి చెల్లదని పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇప్పించి ఎవరింటికి వారిని పంపేసారు. ఐతే ఇద్దరికి డిగ్రీ పూర్తయ్యాక పెళ్లి చేస్తామని ఇరు కుటుంబాలు అంగీకరించాయి. కానీ అప్పటివరకూ తను ఆగలేనంటూ అరవింద్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కళాశాల విద్యార్థినిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారం
తమిళనాడులోని కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దారుణం జరిగింది. కోయంబత్తూరులోని ఓ ప్రముఖ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు విమానాశ్రయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో తీవ్రంగా గాయపడి దుస్తులు లేకుండా కనిపించింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోయంబత్తూరు నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని రాత్రి 11 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు ఫోన్ చేయడంతో విమానాశ్రయం వెనుక ఉన్న రోడ్డుపై ఆపి మాట్లాడుతోంది. ఆమెతో పాటు ప్రక్కనే ఆమె స్నేహితుడు కూడా వున్నాడు. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో అకస్మాత్తుగా, ముగ్గురు దుండగులు కారు వద్దకు తొలుత బాధితురాలి స్నేహితుడిపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం ఆమెను బలవంతంగా చీకటిలోకి ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత ఆమెపై ముగ్గురూ అత్యాచారం చేసి దుస్తులు తీసేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆమె తీవ్రంగా గాయపడిన స్థితిలో మిగిలిపోయింది.
తీవ్రంగా గాయపడిన బాధితారాలి స్నేహితుడు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వెంటనే పోలీసు బృందం విస్తృతంగా వెతికిన తర్వాత, బాధితురాలు సమీపంలోని ఖాళీ స్థలంలో అపస్మారక స్థితిలో, దుస్తులు లేకుండా కనిపించింది. ఆమెను వెంటనే రక్షించి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె తీవ్ర షాక్లో ఉన్నప్పటికీ ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె స్నేహితుడు వినీత్ను చికిత్స కోసం కోయంబత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.