తెలంగాణ రాష్ట్రంలోని అనపర్తి మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత భర్త 2016లో మృతిచెందారు. పి.నాగిరెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం పెరిగి సహజీవనం సాగించారు. ఆ మహిళ కుమార్తెను వివాహం చేసుకుంటానని ఆమెను వేధిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో మరో బాలికను వివాహం చేసుకోగా వారికి ఓ బిడ్డ జన్మించింది. తర్వాత భార్యా బిడ్డలను వదిలేసిన నాగిరెడ్డి.. గతంలో సహజీవనం చేసిన మహిళ వద్దకు మళ్లీ వచ్చి ఆమె కుమార్తెతో పెళ్లి జరిపించాలంటూ ఇరువురిని కొడుతూ వేధించేవాడు. దీంతో పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశానని.. స్టేషన్ వద్ద నాగిరెడ్డి తల్లి తన కుమార్తెపై దాడిచేసి తీవ్రంగా కొట్టిందని వాపోయారు.