వివరాల్లోకి వెళితే.. రితన్య (27)కు, కవిన్ కుమార్ (28)తో పెళ్లి జరగగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడంతో పురుగుమందు తాగి రితన్య ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల క్రితం ఈ జంట వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వివాహం జరిగిన కొన్ని వారాల తర్వాత రితన్య తన భర్త, అతని తల్లిదండ్రులు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ తన ఆత్మహత్యకు కారణాలు చెబుతూ తన తండ్రికి వాట్సాప్లో వాయిస్ నోట్ పంపిన తర్వాత ఈ దారుణమైన చర్య తీసుకుంది. మధ్యాహ్నం సమయంలో మొండిపాళయం వద్ద కారులో ఆమె మృతి చెంది కనిపించిందని, మృతదేహాన్ని అవినాశిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.