అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు నాన్న.. వాట్సాప్ మెసేజ్.. ఆపై పురుగుల మందు తాగి?

సెల్వి

సోమవారం, 30 జూన్ 2025 (10:40 IST)
Dowry case
తమిళనాడులోని తిరుప్పూర్‌లో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివాహం చేసుకున్న మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకునేందుకు వరకట్నమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలడంతో వివాహిత భర్త, అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. రితన్య (27)కు, కవిన్ కుమార్ (28)తో పెళ్లి జరగగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడంతో పురుగుమందు తాగి రితన్య ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల క్రితం ఈ జంట వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వివాహం జరిగిన కొన్ని వారాల తర్వాత రితన్య తన భర్త, అతని తల్లిదండ్రులు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ తన ఆత్మహత్యకు కారణాలు చెబుతూ తన తండ్రికి వాట్సాప్‌లో వాయిస్ నోట్ పంపిన తర్వాత ఈ దారుణమైన చర్య తీసుకుంది. మధ్యాహ్నం సమయంలో మొండిపాళయం వద్ద కారులో ఆమె మృతి చెంది కనిపించిందని, మృతదేహాన్ని అవినాశిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
 
 ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేయూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు