బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో యువకుడు ఆత్మహత్య.. ఎక్కడ?

మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (11:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ప్రియురాలితో గొడవపడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటన ఆ రాష్ట్ర రాజధాని లక్నోలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భాజపా ఎమ్మెల్యే యోగేశ్ శుక్లా మీడియా సెల్లో శ్రేష్ఠ తివారీ అనే 24 ఏళ్ల యువకుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. తివారీ నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్డారు. 
 
విధుల్లో భాగంగా ఎమ్మెల్యే అధికార నివాసంలో ఉన్నప్పుడు తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆమెతో మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. యువకుడు విగత జీవిగా పడి ఉన్నాడు. ప్రియురాలి ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు