దీపావళి పండుగకు అరిసెలు, లడ్డూలు, మైసూర్పాక్ల వంటి స్వీట్లతో పాటు రసగుల్లా వంటి వెరైటీ స్వీట్స్ను కూడా బంధువులకు, ఫ్రెండ్స్కు పంచిపెట్టండి. అయితే రసగుల్లా ఎలా చేయాలో మీకు తెలుసా అయితే ట్రై చేయండి.
తయారీ విధానం:
ముందుగా పాలవిరుగును మెత్తగా మెదిపి, దానికి మైదా జత చేయాలి. దానిని బాగా కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత వేడినీటిలో పిస్తా పప్పులను వేసి ఐదు నిముషాలు ఉంచి, నీటిని వడగట్టి, పైన తొక్కలు తీసి, సన్నగా కట్ చేసుకోవాలి.
తర్వాత పచ్చికోవా పొడి, పిస్తా తరుగు, బాదం పప్పులను ఒక గిన్నెలో వేసి కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేయాలి. పాలవిరుగుతో చేసిన ఒక్కో ఉండలో పిస్తా, బాదం మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కన ఉంచాలి.
ఒక పాత్రలో పంచదార, నీరు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి, వెడల్పాటి పాత్రలో పోసి, కుంకుమపువ్వు రేకులు వేయాలి. తర్వాత పిస్తా, బాదం స్టఫ్డ్ బాల్స్ని ఇందులో వేసి స్టౌ మీద ఉంచి, ఐదు నిముషాలు ఉడికించాలి. అరకప్పు వేడినీరు పోసి, మరో ఐదునిముషాలు ఉంచితే, బాల్స్ రెట్టింపు సైజుకి పొంగుతాయి. అంతే రసగుల్లా రెడీ.