ములాయం సింగ్‌కు మైండ్ చెడిపోయింది : జయప్రద

సోమవారం, 14 ఏప్రియల్ 2014 (18:01 IST)
File
FILE
సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌పై సినీ నటి, రాష్ట్రీయ లోక్‌దళ్ అభ్యర్థి జయప్రద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మైండ్ చెడిపోయినట్టుందని విమర్శించారు. ఇలాంటి నేతలకు ఓట్లతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ తరహా వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు.

అత్యాచార నిరోధ చట్టాలపై ఇటీవల ములాయం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగ్రా పర్యటనలో జయప్రద మీడియాతో మాట్లాడారు. ములాయం సింగ్ వ్యాఖ్యలు మహిళల పట్ల ఆయన వైఖరికి నిదర్శనమని ఆమె అన్నారు.

అత్యాచార కేసులో శిక్షలకు సంబంధించి సాధారణంగా అబ్బాయిలు తప్పు చేస్తుంటారు. దానికి మరణశిక్ష విధిస్తారా? అంటూ ఎస్పీ అధినేత ములాయం గతంలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశంలో తీవ్ర చర్చకు, విమర్శలకు దారి తీసిన విషయం విదితమే.

వెబ్దునియా పై చదవండి