తెలుగు పంచాంగం ప్రకారం జులై 25, శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమయ్యింది. ఈ లెక్కన చూస్తే జులై 29 తొలి మంగళవారం అవుతుంది. శ్రావణంలో వచ్చే అన్ని మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. శ్రావణ మంగళ గౌరీ వ్రతం ముఖ్యంగా కొత్తగా పెళ్లైన అమ్మాయిలు దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం ఆ సర్వమంగళా దేవి అయిన పార్వతీ దేవిని ప్రార్ధిస్తూ చేసే నోము. ఈ వ్రతం చేయడం వల్ల కలకాలం సువాసినులుగా ఉంటారని ప్రతీతి.