చిన్నారులూ.. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగలరా..?

FILE
ప్రశ్నలు :

1. మధ్యయుగంలో చోళులు నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధ బృహదీశ్వరాలయం ఎక్కడ ఉంది?

2. ప్రముఖ డాన్‌ పత్రిక ఏదేశం నుంచి వెలువడుతుంది?

3. మనదేశంలో లోటస్‌ టెంపుల్‌ ఏ నగరంలో ఉంది?

4. మధ్యయుగంలో ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ అయిన రజియా సుల్తానా ఏ వంశానికి చెందింది?

5. మహాత్మాగాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించిన దండి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?

6. "డూ ఆర్‌ డై" అనే నినాదాన్ని గాంధీజీ ఏ జాతీయ ఉద్యమం సందర్భంగా ఇచ్చాడు?

7. వందేమాతరం గేయాన్ని బంకించంద్ర చటర్జీ ఏ నవలో భాగంగా రాశాడు?

జవాబులు :
1. తంజావూరు
2. పాకిస్తాన్‌
3. ఢిల్లీ
4. బానిస వంశం
5. గుజరాత్‌
6. క్విట్‌ ఇండియా ఉద్యమం
7. ఆనందమఠ్‌.

వెబ్దునియా పై చదవండి