మధుమేహానికి మేలు చేసే తోటకూర

ఆదివారం, 7 జనవరి 2018 (10:03 IST)
మధుమేహానికి తోటకూర ఎంతో మేలు చేస్తుంది. రోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. తోటకూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తోటకూర రక్తంలోని చక్కెర నిల్వలను కణాలు చక్కగా అందిపుచ్చుకునేలా చేస్తుంది. గ్లూకోజ్ ఉత్పత్తిని మెరుగుపరిచి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే మధుమేహంతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. 
 
మధుమేహంతో బాధపడేవారు ఫ్యాట్ తక్కువగా ఉండే పాలను రోజూ రెండు కప్పుల వరకు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ప్రొటీన్లు రక్తంలో షుగర్ నిల్వల నియంత్రణకు తోడ్పడతాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా మంచిదే.  
 
ఓట్స్‌‌లో నీటిలో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. నీటితో కలిపితే పేస్ట్‌గా మారడం జరుగుతుంది. ఈ ఫైబర్ జీర్ణ ఎంజైమ్‌లు, ఆహారంలోని పిండి పదార్థాల మధ్య ఓ లేయర్‌గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. బ్రేక్ ఫాస్ట్, సూప్‌లలో భాగంగా దీన్ని తీసుకోవడం ఫలితాన్నిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు